జనసేనానిని మర్యదపూర్వకంగా కలిసిన బైరి వంశీ కృష్ణ

  • వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన పోటీకి సిద్ధం
  • ప్రజాసమస్యలు తీర్చడమే మా ఎజెండా
  • నియోజకవర్గంలో కబ్జాకు గురైన భూములపై పోరాటం చేస్తాం.
  • డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో జరిగిన అవినీతి అక్రమాలను ఎండకడతాము
  • నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులతో భారీ నిరసన కార్యక్రమం చేపడతాము

హైదరాబాద్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన తెలంగాణ ముఖ్య నేతల సమావేశంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోర్డినేటర్ బైరి వంశీ కృష్ణ పాల్గొన్నారు. సమావేశం అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బైరి వంశీ కృష్ణతో ఏకాంతంగా 21నిముషాలు చర్చించి, నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు, మరియు ఇక్కడ జరుగుతున్న భూకబ్జాల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను మరియు నియోజకవర్గంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యలను కూడా వివరించడం జరిగింది. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంకావాలని తెలియజేసారు. ముఖ్యంగా ప్రజాసమస్యల మీద దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేసి జనసేన పార్టీ ఉనికిని చాటాలని సూచించారు. అతిత్వరలో నియోజకవర్గంలో పర్యటించి కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తాను అని తెలియజేసారు..