జమ్మూ కాశ్మీర్ లో 4జి సేవలపై నిషేధం పొడిగింపు

జమ్మూకశ్మీర్‌లో 4జీ సేవలపై ఉన్న నిషేధాన్ని జనవరి 8 వరకు పొడగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఉదమ్‌పూర్‌, గండేర్‌బాల్‌ జిల్లాల్లో మాత్రం 4జీ సేవలు యథాతథంగా కొనసాగుతాయని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ రెండు జిల్లాల్లో మాత్రం 2జీకి కల్పించే ఇంటర్నెట్‌ స్పీడ్‌ కొనసాగుతుందని, ఇంటర్నెట్‌ స్పీడ్‌ విషయంలో మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవని అధికారులు పేర్కొన్నారు.