నిరుపేదల సంఘానికి సంఘీభావం తెలిపిన హుజూర్నగర్ జనసేన

ఉమ్మడి నల్గొండ జిల్లా, హుజూర్నగర్ నియోజకవర్గం, నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో గత 47 రోజులుగా నిరుపేదల సంఘం ఆధ్వర్యంలో ఇల్లాస్థలాల కోసం నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఈ నిరాహార దీక్ష చేస్తున్న పేద ప్రజలకు జనసేన పార్టీ తరఫున హుజూర్నగర్ జనసేన పార్టీ కార్యనిర్వాహకులు సరికొప్పుల నాగేశ్వరరావు జనసైనికులతో కలిసి సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశ అభివృద్ధి అయినా, రాష్ట్ర అభివృద్ధి అయినా, నియోజకవర్గ అభివృద్ధి అయినా పేదరిక నిర్మూలన జరిగినప్పుడే అని ఆయన తెలిపారు. స్థానిక నాయకులు అధికారులు పేద ప్రజల తరఫున ఆలోచించి వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయవలసిందిగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు. వారికి ఇళ్ల స్థలాలు అందే వరకు జనసేన పార్టీ వారికి తోడుగా ఉంటుందని తెలియజేశారు. అనంతరం వారికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరుపేద సంఘానికి భోజన సదుపాయాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో కొమ్మరాజు శ్రీను సాయి చరణ్, దాసరి వాసు వెంకట్ వెంకన్న చందు సందీప్ తరుణ్ పవన్ కళ్యాణ్ జనసైనికులతో పాటు నిరుపేద సంఘ సభ్యులు వాసపల్లయ్య కరుణాకర్ హుస్సేన్ లక్ష్మమ్మ తాళ్లూరి రంగయ్య దుర్గమ్మ సత్తమ్మ దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు.