నెల్లూరు నూతన ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన గునుకుల కిషోర్

నెల్లూరు జిల్లాకి నూతనంగా విచ్చేసిన ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డిని వారి కార్యాలయంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మర్యాదపూర్వకంగా కలిసి జనసేన పార్టీ తరఫున పుష్పగుచ్చం ఇచ్చి సాదరంగా నెల్లూరు జిల్లాకు ఆహ్వానించారు. ప్రశాంతంగా ఉన్న జిల్లాలో ఈ మద్య క్రైమ్ పెరుగుతుందని నివారణకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది.