రాజాం జనసేన ఆధ్వర్యంలో చలివేంద్ర ఏర్పాటు
రాజాం నియోజకవర్గం, రేగిడి ఆమదాలవలస మండలం, రెడ్డి పేట గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్ర ఏర్పాటు చేయడం జరిగింది. గత కొద్ది రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వలన గ్రామాలలో చలివేంద్ర ఏర్పాటులో భాగంగా మొదటి రోజు రెడ్డిపేట గ్రామంలో మజ్జిగ వితరణ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు, వీరమహిళలు, వావిలాపల్లి కిరణ్ కుమార్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-15-at-18.28.49-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-15-at-18.27.39-1024x461.jpeg)