ధర్నాచౌక్, ఇందిరా పార్క్ వద్ద నిరసన దీక్ష

నిర్మల్, టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ వ్యవహారం సీబీఐ కోర్టుకి అప్పచెప్పాలని కోరుతూ అఖిల పక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం నిర్మల్ లో గోల్డెన్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా భేటీ అయిన ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన అఖిలపక్ష నాయకులు నిరుద్యోగుల ఘోష అఖిలపక్ష భరోసా అనే నినాదంతో ఛలో హైదరాబాద్ ఏప్రిల్ 18 న ధర్నాచౌక్, ఇందిరా పార్క్ వద్ద నిరసన దీక్ష చేపడుతున్నట్లు నిర్ణయం చేయడం జరిగింది. దీనికి జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నామని తెలిపారు.