జనం కోసం జనసేన 494వ రోజు

జగ్గంపేట, జనం కోసం జనసేన 494వ రోజులో భాగంగా మన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం జె.కొత్తూరు గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 500 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 72800 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల గౌరవ అధ్యక్షులు పాబోలు సీతారామస్వామి, జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల మీడియా సమాచార కార్యదర్శి సైతన నాగేశ్వరరావు, జె.కొత్తూరు గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, సేనాపతి సాయి, వెంటపాటి దుర్గ, బెపిన సురేష్, మన్యంవారిపాలెం నుండి నమ్మి దుర్గాప్రసాద్, జగ్గంపేట నుండి లంకపల్లి అజయ్ (బన్ను), వల్లూరి అనిల్, గోనేడ నుండి వల్లపుశెట్టి నానిలకు మరియు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా చిన్నూరు గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన మొగిలి చిట్టెమ్మ కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.