రావిపాడులో ప్రారంభించిన జనం చెంతకు జనసేన

పాలకొల్లు, జనసేన పార్టీ జిల్లా సెక్రటరీ బోణం చినబాబు ఆధ్వర్యంలో పోడూరు మండల అధ్యక్షులు పితాని వెంకటేష్ అధ్యక్షతన జనం చెంతకు జనసేన కార్యక్రమాన్ని పోడూరు మండలం రావిపాడు గ్రామంలో జనసేన నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఇంటింటికి తిరుగుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన పార్టీ సిద్ధాంతాలను, జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడం, జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు చేసే సంక్షేమం గురించి వివరిస్తూ ఈ కార్యక్రమం ముందుకు సాగుతుంది అని బోణం చినబాబు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన సిద్ధాంతాలతో కూడిన కరపత్రాలను పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ నాయకులు అల్లు రాధాకృష్ణ, జిల్లా జాయింట్ సెక్రటరీ ఉన్నమట్ల ప్రేమ్ కుమార్, జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు కొప్పిశెట్టి నాగరాజు, బొలిశెట్టి రమేష్, యలమంచిలి మండల అధ్యక్షులు కొడవటి వరబాబు, ఎంపిటిసి మానేపల్లి శ్రీధర్, ఎంపిటిసి యర్రంశెట్టి నర్సింహారావు, మరియు వీర మహిళలు జుత్తుక ప్రియాంక, మైగాపుల పద్మజ, కొప్పిశెట్టి జ్వాల, ముత్యాల అశ్వని, జనసేన నాయకులు లంకలపల్లి రవీంద్ర ప్రసాద్, కొర్రకుటి హరి, ఎడ్ల ప్రసాద్, చొప్పల చందు, అంబటి విజయ్, గుబ్బల భాస్కర్, గంటా కళ్యాణి నాయుడు, బిట్ట లక్ష్మీ నారాయణ, వెంపటల వంశీ, నల్లి ప్రసాద్, చెల్లబోయిన వెంకటరత్నం, గుండెమొగుల వీరాస్వామి, దుప్పనపుడి సతీష్, చేగొండి వేంకటేశ్వర్లు,మొయిల ప్రదీప్, ఇలపకుర్తి నరేష్, గాజుల వాసుదేవ రావు, లంకలపల్లి సుబ్రహ్మణ్యం, అంబటి రవి, లంకలపల్లి సాయిబాబు, విరగుముల గణేష్, హరి కృష్ణా, రామ్ పవనిజం, ప్రసాద్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.