Warangal: రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదు: ఆకుల సుమన్

హనుమకొండ, జనసేన పార్టి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి శ్రీ ఆకుల సుమన్ మాట్లాడుతూ రైతుల ధాన్యం కొనుగోలు కోసం కొత్త కొత్త చట్టాలు తెస్తున్న ప్రభుత్వం, రైతుల ఇబ్బందులను మాత్రం పట్టించుకోవడం లేదు. ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఓపిఏంస్ రిజిస్ట్రేషన్ గురించి పూర్తిగా అవగాహనలేని అధికారుల వల్ల రైతులు అనేక సమస్యలు ఎదురుకుంటున్నారు. రోజులు తరబడి కొనుగోలు సెంటర్ల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. కొనుగోల ఆలస్యం వల్ల ఒక వైపు అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దవుతుంది, ముఖ్యంగా ఎక్కువ శాతం రైతులు గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే వారికి ఈ ఓటీపీలు రిజిస్ట్రేషన్ల గురించి అస్సలు అవగాహన ఉండదు రైతుల కోసం తెచ్చే ఏ చట్టం అయిన ముందు రైతులకు అవగాహన కలిపించాక అమల్లోకి తీసుకొస్తే రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు.