వివోఏ ల సమ్మెకు జనసేన యువజన నాయకుల సంఘీభావం

కొత్తగూడెం నియోజకవర్గం: పాల్వంచ జనసేన యువజన నాయకుల ఆధ్వర్యంలో వివోఏ ల నెలసరి జీతభత్యాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె చేపట్టారు. వివోఏలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, వివోఏలను సేర్పు ఉద్యోగులుగా గుర్తించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని ట్యాబులు ఇవ్వాలని, ఆన్లైన్ రిపోర్ట్ లు చేయమని, గ్రేడింగ్ పద్ధతిని రద్దు చేయాలని, వివోఏ జీతాలు వారి ఎకౌంట్లోనే వేయాలని, అభయ హస్తం డబ్బులు పొదుపు సంఘాలకు ఇవ్వాలని, అర్హులైన వివోఏలను సీసీలుగా ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వివోఏలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా బుదవారం ఉదయం జనసేన పార్టీ యువజన నాయకుల తరుపున సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో, ఓలపల్లి రాంబాబు, ఎం.బ్రహ్మం, మార్గం సందీప్, నరం దాస్ వెంకటేశ్వర్లు, ఎస్.కె ఖాసీం, పి. బాలాజీ, ప్రహర్షిత్, ఎం. ప్రసాద్, రామకృష్ణ, సంపత్ కుమార్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.