వికలాంగుల హక్కుల పోరాట సమితికి జనసేన అండగా ఉంటుంది: డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

వికలాంగుల హక్కుల పోరాట సమితికి జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని జనసేన పార్టీ రాష్ట్ర పిఏసి నెంబర్ మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. వికలాంగుల పెన్షన్ 6000 పెరగాలన్నా, వికలాంగులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలన్నా, అన్ని రకాల వికలాంగుల జాబ్ రోస్టర్ పాయింట్లు 10 లోపు జరగాలన్న రాక్షస మనసు ఉన్నటువంటి వైసీపీ నాయకులను ఎన్నుకోవడం కాదు, పెద్ద మనసున్న మహారాజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజు అవ్వాలి, అటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ వస్తే మీ సమస్యలన్నీ కూడా ముందడుగు వేస్తారని డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న 300 మందికి డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వికలాంగుల హక్కుల పోరాట సమితికి అన్ని సహకారాలు అందిస్తామని తెలియజేశారు.