4వ రోజు జనవాణి – జన చైతన్య యాత్ర
చీపురుపల్లి నియోజకవర్గం, గరివిడి మండలం, కొత్తూరు గ్రామంలో బోడసింగి రామకృష్ణ, తవిటినాయడు గ్రామ జనసైనికులు ఆధ్వర్యంలో 4 వ రోజు జనవాణి – జన చైతన్య యాత్రలో భాగంగా కొత్తూరు గ్రామంలో ప్రతి గడపకు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ఆశయాలను, మేనిఫెస్టో తీసుకెళ్లడం జరిగింది. మరియు ముఖ్యంగా రైతులకు రుణమాఫీ కల్పించమని, ఉన్నత చదువులు చదివిన ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్న నిరుద్యోగులు, ఉపాధి లేక కొందరు కుటుంబాన్ని వదిలి వేరే రాష్ట్రాలకు జిల్లాలకు తరలి వెళ్తున్నారు దీని పరిష్కరించమని గ్రామ ప్రజలు వారి సమస్యలను తెలియపరిచారు. అలాగే గ్రామంలో మాకు ఊహించని అశేషమైన ప్రజల స్పందన లభించింది ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ కి ఒక అవకాశం ఇద్దాం అనే మాటే వినిపిస్తుంది గ్రామం మొత్తం ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు సహకారం లభించినందున పవన్ కళ్యాణ్ తరపున కృతజ్ఞతలు ఇలాగే మిగిలిన నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో కూడా పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ఆశయాలను సామాన్య ప్రజల కోసం ఆయన ఏం చేస్తారో అన్నది ప్రతి ఒక్కరికి తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చీపురుపల్లి నియోజకవర్గం జనసైనికులు పెద్ది వెంకటేష్ , బోడసింగి రామకృష్ణ, అగురు వినోద్ కుమార్, గేడ్డి గొల్లబాబు, చందక బాలకృష్ణ, బాకూరి శ్రీను, పైడితల్లి, పైల ధనుంజయ, పంటల సత్యన్నారాయణ, మన్నెపూరి గణపతి, శంకర్, ఆకుల సత్య, గొర్లె రమణ, మీసాల రాంబాబు, మండాది రాంబాబు మరియు జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-19-at-21.12.13-1024x475.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-19-at-21.12.14-1024x475.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-19-at-21.12.11-1024x475.jpeg)