జనసేన పార్టీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్తలు

చిత్తూరు జిల్లా జనసేన పార్టీ జనరల్ సెక్రెటరీ శ్రీమతి దారం అనిత ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరిన ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బ్లూ మూన్ విద్యాసంస్థల అధినేత మంచి శివశంకర్ మరియు కాపునాడు అనంతపురం జిల్లా అధ్యక్షులు గవ్వల శ్రీనివాసరావు మరియు కొమ్మినేని చిన్నపరెడ్డి జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంచి పరిపాలన అందించడానికి కృషి చేస్తానని భావితరాల బంగారు భవిష్యత్తు నిర్మిద్దామని అందుకోసం అందరూ కలిసికట్టుగా పని చేద్దామని అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ సందర్భంగా దారం అనిత మీరు అనుమతిస్తే రాయలసీమలో ఇంకా చాలామంది చేయడానికి సిద్ధంగా ఉన్నారని అధినేతకు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారికి అధ్యక్షులు వారికి సూచించారు. ఈ సందర్భంగా మదనపల్లె జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, యువ నాయకులు శ్రీరామ హరి హారన్ అధ్యక్షులుని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం, శాలువాతో సత్కరించారు.