అనుశ్రీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

రాజమండ్రి సిటీ, స్థానిక 39 వ వార్డు వద్ద జనసైనికుడు అయినటువంటి సేనాపతి దుర్గాప్రసాద్ మరియు వారి మిత్రబృందం ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ ప్రారంభోత్సవం జరిగింది. దుర్గాప్రసాద్ మరియు 39 వ వార్డు జనసైనికులు ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పాల్గొని వాహనదారులకు, బాటసారిదారులకు, బస్సులో వెళ్లే ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనుశ్రీ మాట్లాడుతూ ఎండలు చాలా తీవ్రంగా ఉండడం, ఉష్ణోగ్రతల పెరగడం వలన ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తమై తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఇచ్చారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్డులో మజ్జిగ జనసేన పార్టీ తరఫున సేవా దృక్పథంతో పంపిణీ చేస్తూ ఉంటామని పేర్కొన్నారు. అదేవిధంగా అభివృద్ధి పేరు చెప్పి ప్రజల సొమ్ము వృధా చేస్తున్నారని, అలాగే ఇప్పుడున్న తుమ్మలోవ ప్రాంతం చిన్నపాటి వర్షానికి ములుగుతుందని ఇలాంటి ప్రాంతాలను పట్టించుకోవాలని సూచించారు. త్వరలోనే జనసేన పార్టీ అధికారం వస్తుందని అప్పుడు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులు పైడిరాజు, నల్లంశెట్టి వీరబాబు, సిటీ కార్యదర్శులు అల్లాటి రాజు, గుణ్ణం శ్యాంసుందర్ సంయుక్త కార్యదర్శి పొట్నూరి శ్రీనివాస్ ఠాగూర్ కురం అప్పారావు మరియు సీనియర్ జనసేన నాయకులు 28వ వార్డ్ విక్టరీ వాసు చెవికొండ మురళి నర్సిపూడి రాంబాబు మంచాల సునీల్ మంచు ప్రవీణ్ మాసా నాని నవీన్ మహేష్ బత్తిన సత్యనారాయణ మరియు జనసైనికులు స్థానికులు పాల్గొన్నారు.