మిర్తిపాడులో 3 వ రోజు “జనంకోసం జనసేన – మహాపాదయాత్ర”
- జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మికి అడుగడుగునా ఘనస్వాగతం
రాజానగరం, “జనంకోసం జనసేన – మహాపాదయాత్ర” మిర్తిపాడు గ్రామంలో 3 వ రోజు కార్యక్రమంలో భాగంగా 3 వ రోజు రాజానగరం జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి సీతానగరం మండలం, మిర్తిపాడు గ్రామంలో గ్రామ ప్రజల ఆదరాభిమానాలతో ప్రతీ ఇంటికీ తిరుగుతూ, జనసేన పార్టీ సిద్ధాంతాలతో కూడిన కరపత్రాలను పంచుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, బాగోగులు అడిగి తెలుసుకొంటూ, ప్రతి కష్టంలో మీకు తోడుగా అండగా ఎల్లపుడూ జనసేన పార్టీ ఉంటుందని చెప్తూ, జనసేన పార్టీ కరపత్రం ఇచ్చి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రతి ఇంటికీ వివరిస్తూ పవన్ రావాలి పాలన మారాలి అనే నినాదంతో ఈసారి పవన్ కళ్యాణ్ కి ఒక్క అవకాశం ఇచ్చి ఆయన్ని ముఖ్యమంత్రిని చేయాలనీ కోరడం జరిగింది. ఈ మహాపాదయాత్రలో మిర్తిపాడు జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-26-at-10.17.33-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-26-at-10.17.34-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-26-at-10.17.35-1024x768.jpeg)