ఫతేనగర్ లో కార్మికుల దినోత్సవ వేడుకలు

కూకట్పల్లి, కార్మికుల దినోత్సవ సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా కార్మికులకు అల్పాహారం మరియు టిఫిన్ బాక్స్ ల పంపిణీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శంకర్ గౌడ్ మాట్లాడుతూ కార్మికులు ఈ దేశానికి ఎన్నో విధాలుగా సహాయపడుతున్నారని, ఈ తెలంగాణ ప్రభుత్వం వాళ్లకు అన్ని విధాలుగా ఆదుకోవాలి కార్మికులకు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను పరిష్కరించి వీరికి తెలంగాణ ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శంకర్ గౌడ్ కూకట్పల్లి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ నాగేంద్ర, తెలంగాణ వీరమహిళ కావ్య, ముంతాజ్ మరియు జనసేన పార్టీ నాయకులు తుమ్మల మోహన్, మహేష్, కొల్లా శంకర్, నాగరాజు, ఠాగూర్, సుదర్శన్, రాము, సాంబయ్య, వీరు, సునీల్, నరేష్, నాగూర్ మరియు జనసైనికులు, వీరమహిళలు పాల్గొనడం జరిగింది.