ఖమ్మం ట్యాంక్ బండ్ పై అంబేద్కర్, జలగం వెంగళ రావు విగ్రహాలు ఏర్పాటు చేయాలి: రామకృష్ణ మిరియాల

ఖమ్మం ట్యాంక్ బండ్ పై ఎన్టీఆర్ గారి విగ్రహంతో పాటు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మరియు మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళ రావు గారి విగ్రహాలు కూడా ఏర్పాటు చేయాలి ఖమ్మం నియోజకవర్గ జనసేన కోఆర్డినేటర్ రామకృష్ణ మిరియాల డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం నగరంలో గల ట్యాంక్ బండ్ నందు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఏర్పాటు చేయడాన్ని ఖమ్మం జనసేన పార్టీ తరుపున స్వాగతిస్తున్నాం, అలాగే భారత రాజ్యాంగ నిర్మాత భీంరావ్ అంబేద్కర్ గారి విగ్రహం మరియు కేంద్ర మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసి ఖమ్మం జిల్లా అభివృధికి కృషి చేసిన ఖమ్మంజిల్లా వాసి స్వర్గీయ జలగం వెంగళ రావు గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం స్పందించి వారి విగ్రహాలను ఏర్పాటు చేయకపోతే జనసేన పార్టీ తరుపున ఈ విషయంలో పోరాటం చేయడం జరుగుతుంది అని రామకృష్ణ మిరియాల తెలిపారు.