రోడ్డు మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని జనసేన డిమాండ్
అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి సుండుపల్లి మండల పరిధిలో తిమ్మసముద్రం నివాసి చక్రాల వెంకటసుబ్బయ్య(పెయింటర్) సోమవారం మధ్యాహ్నం సమయంలో రాయచోటి నుండి సుండుపల్లి రోడ్డు అనుంపల్లి అటవీ మార్గ మధ్యలో స్టబ్స్టేషన్ సమీపంలో ఇరుకుగా గుంతలమయమైన రోడ్డు మీద ద్విచక్ర వాహనం ఎదురుగా వేగంగా వెళ్ళే ఆర్టిసి బస్ ను తపించబోయే క్రమంలో ప్రమాదానికి గురై తీవ్ర గాయలయ్యిన వెంకటసుబ్బయ్య ఆ విషయం తెలుసుకున్న జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ వారి స్వగృహం నందు స్థానిక గ్రామస్థులు, బీసీ నేత గంతల చెన్నకృష్ణ, తిరుమలయ్య, మిత్రులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా రామ శ్రీనివాస్ మాట్లాడుతూ రహదారి పనులు ఆలస్యం కారణంగా ఇటువంటి సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి ఇప్పటికైనా పాలకులు నిర్లక్ష్యం వీడి ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని జనసేనపార్టీ తరపున డిమాండ్ చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-16-at-21.50.33-1024x461.jpeg)