మండే వేసవిలో ఆమదాలవలస జనసేన ఆధ్వర్యంలో చల్లని చలివేంద్రం

ఆమదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుర్జ మండలంలో మంగళవారం మండల అధ్యక్షులు కొత్తకోట నాగేంద్ర, ఎంపీటీసీ విక్రమ్ చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రతి రోజు మజ్జిక అలాగే చల్లని నీరు ప్రజలు అందరికీ అందుబాటులో ఉంటుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గేదెల వాసు, కిరణ్ వీరు, పొట్నురు ప్రసాద్, సేపెన రమేష్, టంకాల రమేష్, రుద్ర, రౌతు జగ్గు నాయుడు, మహేష్, అభి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు విచ్చేసి జయప్రదం చేశారు.