అస్వస్థతకు గురైన వ్యవసాయ కూలీలను పరామర్శించిన గాదె

గుంటూరు: పొన్నూరు నియోజవర్గం, పెడకాకని మండలం, ఉప్పలపాడు గ్రామంలో పొలం పనికి వచ్చిన వ్యవసాయ కూలీలు పొలములో గుళికలు మందులు చల్లుతూ ఉన్న సందర్భంలో ఆ మందుల ప్రభావంతో 20 మంది రైతు కూలిలు అస్వస్థతకు గురయ్యారు.. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు హుటాహుటిన వారి గురుంచి పూర్తి సమాచారం మండల అధ్యక్షులు వీరేళ్ల.వెంకటేశ్వరరావు ను అడిగి తెలుసుకొని వెంటనే కొత్తపేటలో ఉన్న శ్రావణి హాస్పిటల్ కి వెళ్లి ఆ ప్రమాదానికి గురైన రైతు కూలీలను, వారి కుటుంబ అభ్యులను కలిసి వారిని పరామర్శించడం జరిగింది. అలాగే వారి ఆరోగ్యం గురించి వైద్యులను సంప్రదించి వారికి పూర్తి వైద్యం అందించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, నారదాసు రామచంద్ర ప్రసాద్, శిఖా బాలు, త్రినాథ్, సతీష్, మధు లాల్, తుమ్మల నరసింహారావు, పల్లెంపాటి‌ రమేష్, విన్నకోట సుబ్రహ్మణ్యం, యాలం రమేష్, సోమిశెట్టి పాండు, మహేష్, సూరి, గంగిశెట్టి వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.