కుంచె అప్పారావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, ఇనుగంటివారిపేట గ్రామనికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు కుంచె అప్పారావు అకాల మరణ వార్త జనసేన పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూప దేవి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో రాజానగరం మండలం జనసేన అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, సీతానగరం మండలం జనసేన పార్టీ కో -కన్వీనర్ కాత సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి దుబాయ్ శ్రీను, సీతానగరం మండల నాయకులు అప్పయమ్మ (ప్రసాద్ ), రాయపాటి ప్రసాద్, కోరుకొండ మండలం జనసేన పార్టీ నాయకులు చదువు ముక్తేశ్వరరావు, చదువు నాగేశ్వరరావు, ఇనుగంటివారిపేట జనసైనికులు పాల్గొన్నారు.