కణంపల్లి ప్రసాద్ ను పరామర్శించిన కుంటిమద్ది

అనంతపురం ఉమ్మడి జిల్లా, కదిరి నియోజకవర్గం సీనియర్ జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు కణంపల్లి అను ప్రసాద్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ, అనంతపురం పట్టణము నందు పావని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
విషయం తెలుసుకున్న అనంతపురం ఉమ్మడి జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి పావని ఆసుపత్రికి వెళ్లి అనుప్రసాద్ గారి యోగక్షేమాలు తెలుసుకొని, పావని ఆసుపత్రి డాక్టర్లను కలిసి మెరుగైన వైద్యం అందించాలని తెలియజేయడం జరిగింది. భగవంతుని దయతో కణంపల్లి అను ప్రసాద్ గారి ఆరోగ్యం తొందరగా మెరుగుపడాలని పార్ధించారు. కణంపల్లి అను ప్రసాద్ భార్య జనసేన పార్టీ వీరమహిళ అనంతపురం ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి శ్రీమతి అనురాధ మరియు వారి కుటుంబ సభ్యులను కలిసి ఎల్లవేళలా అనంతపురం జిల్లా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మీకు అండదండగా, తోడుగా ఉంటారని, భగవంతుని దయతో అనుప్రసాద్ గారి ఆరోగ్యం తొందరగా మెరుగుపడుతుందని, మేము అందరం మీ కుటుంబ సభ్యులకు తోడుగా ఉంటామని మనోధైర్యాన్ని నింపడం జరిగింది.