పలు కుటుంబాలను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ ఐ.పోలవరం మండలం టీ.కొత్తపల్లి గ్రామస్తులు మచ్చ నాగబాబు చిన్న తండ్రి మచ్చ మోహన్ రావు 65 సంవత్సరములు అకాల మరణం చెందడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలియపరిచారు. మరియు అదే గ్రామానికి చెందిన వడగన ఫణీంద్ర 20 సంవత్సరములు హఠాత్ మరణంచెందడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి సానుభూతి తెలియపరిచారు. వీరి వెంట మండల అధ్యక్షులు మద్యంశెట్టి పురుషోత్తం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జున రావు అలాగే రాష్ట్ర సహాయ కార్యదర్శి జక్కంశెట్టి పండు జిల్లా కమిటీ కార్యదర్శి తాళ్లూరి ప్రసాద్, మట్ట ఏసుబాబు, నరాల శెట్టి రాంబాబు, పితాని రామకృష్ణ, చెల్లుబోయిన చిన్న బాబు మరియు గ్రామస్తులు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.