జనసేనాని త్వరగా కోలుకోవాలని కోట దుర్గ అమ్మవారికి పూజలు జరిపించిన పాలకొండ జనసేన

పాలకొండ నియోజకవర్గం: జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ అస్వస్థత (జ్వరం) నుండి త్వరగా కోలుకోవాలని, ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాలకొండ ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ కోట దుర్గ అమ్మవారి ఆశీస్సులను పవన్ కళ్యాణ్ కు ఉండాలని ఆయన పేరుతో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోపాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు, పోరెడ్డి ప్రశాంత్, మత్స్య పుండరీకం, జనసేన జానీ, జామి అనిల్, జనసైనికులు చరణ్ అనిల్, అభి, బొడ్లపాడు వీర మహిళలు పాల్గొన్నారు.