క్రియాశీలక సభ్యునికి ఇన్సూరెన్స్ అందజేసిన పితాని

ముమ్మిడివరం, జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఐ.పోలవరం మండలం, జి.వేమవరం గ్రామంలో ఇటీవల ఏక్సిడెంట్లో గాయపడిన జనసేన నాయకుడు మదింశెట్టి శ్రీనివాసరావుకి జనసేన క్రియాశీలక సభ్యత్వ ఇన్సూరెన్స్ ద్వారా జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పంపిన 25,300 రూపాయలు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.