పలు కుటుంబాలను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ కాట్రేనికోన మండలం, బలుసుతిప్ప గ్రామస్తులు జనసేన నాయకులు ఓలేటి అప్పారావు కుమారుడు ఓలేటి జీవన్(13) క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ శుక్రవారం రాత్రి కాకినాడ జిజిహెచ్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడవడం జరిగింది. పితాని బాలకృష్ణ బలుసుతిప్ప గ్రామం వెళ్లి శ్రద్ధాంజలి ఘటించి వారి ఆత్మకు కలగాలని కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏసిఎఫ్ సంసాని పాండురంగ మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం మండలం అయినాపురం గ్రామంలో చప్పిడి రామకృష్ణ భార్య అనారోగ్యంతో మరణించారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరియు సూరా చెరువు గ్రామానికి చెందిన దొంగ వెంకటేశ్వరరావు కుమారుడు హార్ట్ ఎటాక్ తో మరణించారు. వారి కుటుంబ సభ్యులు పరామర్శించారు. వీరి వెంట రాష్ట్ర కార్యదర్శి జక్కంశెట్టి బాలకృష్ణ కడలి వెంకటేశ్వరరావు యలమెల లోకేష్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.