పలుకుటుంబాలను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం మండలం, పెద్ద కొత్తలంక చాకిరేవుచెరువు గ్రామానికి చెందిన విత్తనాల సీతమ్మ ఇటీవల పాముకాటుకు గురై మృతిచెందడం జరిగింది. వారి భర్త పెద్దబ్బులు మరియు వారి కుటుంబ సభ్యులను, ఉప్పలగుప్తం మండలం కూనవరం గ్రామానికి చెందిన దామిశెట్టి నాగేశ్వరరావు ఇటీవల మృతిచెందిడంతో వారి కుటుంబ సభ్యులను, అమలాపురం మండలం వేమవరప్పాడు గ్రామానికి చెందిన వాకపల్లి కృష్ణారావు ఇటీవల మృతిచెందడంతో వారి కుటుంబ సభ్యులను, అమలాపురానికి చెందిన ఆచంట సీతారత్నం ఇటీవల మృతిచెందడంతో వారి కుటుంబ సభ్యులను జనసేనపార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దూడల స్వామి, బండారు వెంకన్నబాబు, పెన్నాడ శివ, వంగా సీతారాం, పితాని శివ, గుత్తుల నాగబాబు, విత్తనాల నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, రాంబాబు, వెర్రియ్య తదితరులు పాల్గొన్నారు.