పలు కుటుంబాలను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ కాట్రేనికోన మండలం వేట్లపాలెం గ్రామానికి చెందిన సానబోయిన సత్యనారాయణ (ఎస్.వి.ఎస్) భార్య అనారోగ్యంతో బాధపడుతున్నారు వారిని పరామర్శించారు. అదే గ్రామానికి చెందిన యల్లమెల్లి శ్రీనివాసరావు తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే గ్రామానికి చెందిన కొప్పాడ బాలకృష్ణ సతీమణి కొప్పాడ నిర్మల (ఎక్స్ సర్పంచ్) అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే గ్రామానికి చెందిన విత్తనాల బాబాజీ అనారోగ్యంతో బాధపడుతున్నారు వారిని పరామర్శించారు. కాట్రేనికోన (హనుమాన్ జంక్షన్) గ్రామానికి చెందిన కాజా కృష్ణమూర్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు వారి కుటుంబ సభ్యులు పరామర్శించారు. అదే గ్రామానికి చెందిన కుడుపూడి శ్రీరామ్ భార్య పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించారు. మరియు లచ్చిరాయి చెరువు గ్రామానికి చెందిన ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వజ్రపు శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించారు. మరియు కాట్రేనికోన గ్రామానికి చెందిన వంగా సుబ్రహ్మణ్యం కరెంట్ షాక్ కి గురై తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారిని వారి కుటుంబ సభ్యులు పరామర్శించారు. మరియు అదే గ్రామానికి చెందిన ఇటీవల విద్యుత్ ఘాతంతో మృతి చెందిన ఈదరపల్లి పృథ్వీరాజ్ కుటుంబ సభ్యులు పరామర్శించారు. వీరి వెంట కాట్రేనికోన మండల అధ్యక్షులు మోకా బాల ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కంశెట్టి బాలకృష్ణ, సంసాని పాండురంగ, శీలం సూర్యనారాయణ, పిల్లి గోపి, గిడ్డి రత్నశ్రీ, బీమాలసూరినాయుడు, పాయసం సాయి, యల్లమెల్లి శ్రీను, నందిక ఈశ్వరరావు, ఇళ్ల ఏసు, కడలి వెంకటేశ్వరరావు, దంగేటి ఏసుబాబు, సానబోయిన రమేష్ మరియు జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.