పలు కుటుంబాలను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం, జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ కాట్రేనికోన మండలం సత్తమ్మ చెట్టు గ్రామానికి చెందిన గుత్తుల రత్నం మరణించగా వారి కుమారులను కలిసి సంతాపం తెలిపి వారిని పరామర్శించారు. మరియు కాట్రేనికోన గ్రామానికి చెందిన పితాని సత్యనారాయణ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు మరియు పల్లంకుర్రు శివారు గొల్ల గరువు గ్రామానికి చెందిన ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పెనుమత్స సత్యనారాయణ రాజు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాట్రేనికోన మండల అధ్యక్షులు మోకా బాల ప్రసాద్, మండల కార్యనిర్వాహక కార్యదర్శి, సంసాని పాండురంగ రావు, మాజీ సొసైటీ అధ్యక్షులు శీలం సూర్యనారాయణ, మండల కార్యదర్శి పిల్లి గోపి, గిడ్డి పండు (ఏసిఎఫ్), ఓగూరి భాగ్యశ్రీ, గిడ్డి రత్నశ్రీ, నందిక ఈశ్వరరావు మరియు జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.