పలు కుటుంబాలను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం: బుధవారం రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో అకాల మరణం చెందిన పోలిశెట్టి వెంకట్రావు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గెద్దనపల్లి గ్రామానికి చెందిన దంతులూరి దశరథ రఘురామ ఆంజనేయ వర్మ అనారోగ్యంతో మరణించారు వారి కుటుంబ సభ్యులకు పరామర్శించారు. ముమ్మిడివరం మండలం కాపు చింతలపూడి రాయుడువారి పాలెం గ్రామానికి చెందిన రాయుడు నాగేశ్వరి అనారోగ్యంతో మరణించారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరి వెంట కాయలు బలరాం, సీఎం, అడప సాయి, పిల్లి గోపి, సామసాని పాండురంగ, మట్టపర్తి శంకర్, గిడ్డి రత్నశ్రీ, జక్కంపూడి కిరణ్ రాయుడు, శివ రాయుడు, శివ, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.