ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ లోని బోయినపల్లి ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్ అడ్మిన్‌ బ్లాక్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో స్కూల్ రికార్డులు, కంప్యూటర్లు పూర్తిగా కాలిపోయాయి. ఒక్కసారి మంటలు అంటుకోవడంతో బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. దీంతో ఆ పరిసర ప్రాంతం అంతా పొగలు దట్టంగా వ్యాపించాయి. పాఠశాల సిబ్బంది సమాచారంతో రెండు వాహనాలతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదం షాక్ సర్య్కూట్ కారణంగా జరిగినట్లు అంచనా వేస్తున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా వైపు కరోనా కలకలం సృష్టిస్తుంటే మరోవైపు అగ్నిప్రమాద ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది.