పాల్వంచ జనసేన ఆధ్వర్యంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ: జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాల్వంచ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాల్వంచ మండలం లక్ష్మీదేవి పల్లి గ్రామపంచాయతీలో ఉన్న యువసేన అనాధ శరణాలయం ముందు జనసైనికుడు బ్రహ్మం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, పిల్లలకు ఫ్రూట్స్ స్వీట్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్త బ్రహ్మ మాట్లాడుతూ గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, రెండు తెలుగు రాష్ట్ర జనసేన నాయకులకు, వీరమహిళలకు, అభిమానులకు, కార్యకర్తలకు జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. 2024లో ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి రాబోతుందని, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారని జనసేన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలలో సమస్యలపై పోరాడుతూ ప్రజల్లో బలమైన పార్టీగా అవతరించబోతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు బ్రహ్మం, బాలాజీ, పవన్, రమేష్, సాయి, రాము, పాండు, న్యూ పాల్వంచ చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు ఖాసీం, మరి కొంతమంది జనసైనికులు పాల్గొన్నారు.