పాలకొండ జనసేన కార్యాలయంలో పిసిని చంద్రమోహన్ కు ఘన సత్కారం

పాలకొండ నియోజకవర్గం: పాలకొండ జనసేన పార్టీ కార్యాలయంలో ఇటీవలే అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర తూర్పు కాపు సంఘం అధ్యక్షులు శ్రీ పిసిని చంద్రమోహన్ గారిని రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా నియమించారు. ఈ సందర్భంగా పాలకొండ జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో పిసిని చంద్రమోహన్ గారికి సన్మాన కార్యక్రమం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ.. గతంలో కాపు సామాజికవర్గానికి అన్యాయాల మీద పోరాటం చేస్తూ ఈ రోజు వరకు కొనసాగిస్తూ వస్తున్న సమయంలో ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు, బడుగు బలహీన వర్గానికి న్యాయం చేయగల ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ అని, ఆయనను నమ్మి, జనసేన పార్టీ సిద్ధాంతాలను నమ్మి పార్టీలోకి వచ్చానని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ బాధ్యతను ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. నియోజకవర్గంలో గర్భాన సత్తిబాబు సమక్షంలో గ్రామస్థాయిలో మండల స్థాయిలో కమిటీలు వేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని సిద్ధాంతాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కృషి చేయాలని జనసైనికులకు పిలుపునిచ్చారు.