శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా భారీ బైక్ ర్యాలీ

ఎచ్చెర్ల నియోజకవర్గం: రణస్థలం మండలం, పైడిభీమవరం గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు వడ్డాది శ్రీనువాసరావు పుట్టిన రోజు సందర్భంగా పుట్టిన రోజు వేడుకల కార్యచరణ నిమిత్తం గురువారం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో భాగంగా జనసేన నాయకులు మాట్లాడుతూ.. నాయకులు వడ్డాది శ్రీనువాసరావు పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఉదయం 9:00 గంటల నుండి బ్లెండ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించబడును. మరియు మధ్యాహ్నం 3:00గంటల నుండి పైడిభీమవరం నుంచి కోష్టా మీదుగా భధ్రమహాకాళి వయా జంక్షన్ నుండి తెప్పలవలస మీదుగా రణస్థలం వరకు మరియు కుమ్మసిగడాం, సంచాం మీదుగా పైడిభీమవరం వరుకు తదుపరి 7:00గంటలకు కేక్ కటింగ్ తదనంతరం విందు భోజనం ఏర్పాటు చేయబడును. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నాయకులు సైనికులు, వీరమహిళలు, కార్యకర్తలు భారీ యెత్తున హాజరుకావలసినిదిగా వినయపూర్వకంగా కోరుచున్నామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రణస్థలం మండలం జనసేన పార్టీ నాయకులు దన్నాన చిరంజీవి, కృష్ణాపురం పంచాయతీ జనసేన పార్టీ నాయకులు పోట్నూరు లక్ష్మునాయుడు, అఖిలభారత బిసి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఉత్తరాంధ్ర వేలమసంఘం నాయకులు దాసరి బలరాం, దేరశాం జనసేన నాయకులు దన్నాన రవింద్ర, రణస్థలం జనసేన ఇజ్జిరోతి రమణ, కూర్మరావు, యం కృష్ణారావు, కృష్ణా, శేఖర్, ప్రసాద్, బాలు తదితరులు పాల్గొన్నారు.