పొన్నలూరు ఎం.ఆర్.ఓ సమక్షంలో అన్ని రాజకీయ పార్టీల సమావేశం

  • సమావేశంలో పాల్గొన్న జనసేన నాయకులు

ప్రకాశం జిల్లాలో పొన్నలూరు మండలంలో ఎం.ఆర్.ఓ సమక్షంలో బుధవారం జరిగిన అన్ని రాజకీయ పార్టీల సమావేశంలో జనసేన పార్టీ పొన్నలూరు మండల అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్, ఉపాధ్యక్షులు దోరడ్ల సుబ్రహ్మణ్యం నాయుడు, ఐ.టీ అధ్యక్షులు పిల్లిపోగు పీటర్ బాబు, ఐ.టీ ఉపాధ్యక్షులు పెయ్యల రవి, మండల కార్యదర్శి సుంకేశ్వరం శ్రీను, ప్రధాన కార్యదర్శి షేక్ మహబూబ్ బాషా, యూత్ లీడర్ గడిపూడి భార్గవ్, సంయుక్త కార్యదర్శి కాకాని అంజయ్య మొదలైన జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఓటర్ల లిస్టు నందు చనిపోయిన వారు, గ్రామం నుండి వెళ్లిపోయిన వారు, డూప్లికేట్స్ ఓటర్స్, వాటర్ పేరు అడ్రస్సు, ఫోటో, సవరణ, పోలింగ్ స్టేషన్స్ పరిశీలన చేయుటకు ప్రతి ఒక్క గ్రామానికి బి.ఎల్.ఓ లు వి.ఆర్.ఓ, వి.ఆర్.ఏ మరియు ఎం.ఆర్.ఓ సమక్షంలో సర్వే చేయడం జరుగుతుంది.