గుంటూరులో ఘనంగా కాపు సంక్షేమ సేన కార్యకర్తల సమావేశం

  • కాపు సంక్షేమ సేన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు బండికల్లు శ్యామ్ ప్రసాద్

గుంటూరు: పట్టణంలోని నండూరి కోటేశ్వరరావు కళ్యాణ మండపం (అరండల్ పేట) సాలిపేట 1వ లైన్ లో కాపు సంక్షేమ సేన కార్యకర్తల సమావేశం సోమవారం గుంటూరు పట్టణ కార్యదర్శి గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశం జరిగినది. విశిష్ట అతిథులుగా గుంటూరు పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు నేరేళ్ళ సురేష్, గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, గుంటూరు జిల్లా ఆధికార ప్రతినిధి ఆళ్ళ హరి, పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ మాజి మంత్రి శ్రీ చేగొండి హరిరామజోగయ్య ఏంతో ఉన్నతమైన ఆశయంతో ఏర్పాటు చేసినదే ఈ కాపు సంక్షేమ సేన. తన సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఎన్నో ఓడుదోడుగులు చవిచూసిన మహోన్నతమైన నాయకుడు జోగయ్య గారని కోనియాడినారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా మీరందరూ శక్తి వంఛన లేకుండా కృషి చేసి పవన్ కళ్యాణ్ గారి విజయానికి దోహదపడగలరని సురేష్ అన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టి అధ్యక్షులు బండికల్లు శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పర్యటించి, అన్ని నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయటం జరుగుతుందని తెలిపారు. జనసేన పార్టీకి అనుబంధంగా ఉన్న ఈ కాపు సంక్షేమ సేన రానున్న రోజుల్లో జనసేన, తెలుగుదేశం పార్టీలు అధికారాన్ని హస్తగతం చేసుకుని ప్రజలకు సుపరిపాలన అందిస్తారని మనసారా, వాచా, కర్మణా కోరుకుంటున్నానని శ్యామ్ ప్రసాద్ అన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, సీనియర్ నాయకులు హుస్సేన్ రావు, తిరుమలశెట్టి శంకరరావు, కె.యస్.యస్. జిల్లా కార్యదర్శి పి. గంగాధరరావు, యూత్ వింగ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి బి. ఓం కోటేశ్వరరావు, కార్యదర్శి. బి. చిరంజీవి, జి. లక్ష్మణరావు, కె. త్రిపురా శ్రీనివాస్, బి. రామప్రభు, కె.యస్. యస్. మహిళా నాయకురాలు వరలక్ష్మి, హరి సుందరి, యం. సాంబ్రాజ్యం, అలివేలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. తదనంతరం కాపు సంక్షేమ సేన నూతన నియామక పత్రాలను జిల్లా అధ్యక్షుడు బండికల్లు శ్యామ్ ప్రసాద్ అందజేసినారు.