కళ్యాణదుర్గంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవం

కళ్యాణదుర్గం, గురువారం జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవంను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు లక్ష్మీనరసయ్య, జనసేన వీరమహిళలు షేక్ తార, మమత, కల్పన, పట్టణ అధ్యక్షులు వంశీకృష్ణ, బ్రహ్మసముద్రం మండల అధ్యక్షులు అంజినేయులు, కళ్యాణదుర్గం మండల అధ్యక్షులు జాకీర్ హుస్సేన్, కంబదూరు మండల అధ్యక్షులు చంద్రమౌళి, శెట్టూరు మండల అధ్యక్షులు కాంతరాజ్, కంబదూరు మండల ఉపాధ్యక్షులు వెంకటేష్, కుందుర్పి మండల ఉపాధ్యక్షులు గంగాధర, శెట్టూరు మండల ఉపాధ్యక్షులు రామలింగ, కళ్యాణదుర్గం జనసేన నాయకులు సయ్యద్ మహబూబ్ పాషా, రాజు, కళ్యాణదుర్గం మండల కమిటీ సభ్యులు అనిల్ పాళ్యం, కార్తీక్, జనసైనికులు పాల్గొన్నారు.