జనసేన ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమావేశం

కోడుమూరు నియోజకవర్గం: కోడుమూరు మండలం, ముడుమగుర్తి గ్రామంలో క్రియాశీలక ముఖ్య కార్యకర్తల “ఆత్మీయ సమావేశం” ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన – టిడిపి పార్టీల సమన్వయ అధ్యక్షులు సురేష్ బాబు చింత ఆదేశాల మేరకు ముడమలగుర్తి గ్రామ నాయకులు గిరీష్ మాస్మన్న శేఖరు రవి గిరిధర్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం దిశగా ముందుకు తీసుకు వెళ్లే విధంగా అందరం కలిసికట్టుగా ఐకమత్యంతో కృషి చేయాలని కోరుతూ జనసేన టిడిపి సమన్వయ కమిటీ సభ్యులు ఆకెపోగు రాంబాబు, కోడుమూరు నియోజకవర్గ నాయకులు కృష్ణ బాబు, మహబూబ్ బాషా షాలుభాష, మధుసూదన్, గోపి, మధు, నాగరాజు, వంశీ, నాగరాజు, కోడుమూరు నియోజకవర్గ జనసైనికులు పాల్గొన్నారు.