కొత్తూరు గ్రామంలో జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీల ఆత్మీయ సమావేశం
దెందులూరు నియోజకవర్గం, పెదపాడు మండలం, కొత్తూరు గ్రామంలో ఉన్న రాఘవ చౌదరి కొబ్బరి తోటలో జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలతో గురువారం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు పార్లమెంటు అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్, ఏలూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య చంటి, దెందులూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు, జనసేన రాజకీయ వ్యవహారాల కార్యదర్శి, దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి, జిల్లా ఎన్నికల కన్వీనర్ రాఘవయ్య చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-18-at-4.51.26-PM-1024x539.jpeg)