పవన్ కళ్యాణ్ నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తా: జనసేన జానీ

పాలకొండ: పవన్ కళ్యాణ్ గారు నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తానని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి జనసేన జానీ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియైతులైన జానీ సంతోషం వ్యక్తం చేస్తూ గురువారం మీడియా ముఖంగా మాట్లాడుతూ.. గతంలో నేను మెగాస్టార్ చిరంజీవి గారు పార్టీ ప్రజారాజ్యం నాటి నుంచి నేటి జనసేన వరుకు పొలిటిక్స్ లో కొనసాగుతున్నాను. ఈ రోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక మారు మూల ప్రాంతంకి సంబందించిన ఒక మధ్యతరగతి కుటుంబంకి చెందిన వ్యక్తిగా ఉంటూ ఆటో వృత్తిని కొనసాగించే నాకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించడం పట్ల పార్టీ అధ్యక్షులు వారికి ఋణపడి ఉంటాను అని జనసేన జానీ అన్నారు. నాకు ఈ పదవి రావడానికి సహకరించి నన్ను గుర్తించిన రాష్ట్ర పీఏసీ మెంబెర్ నాదెండ్ల మనోహర్, జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ గారికి మరియు నియోజకవర్గం నాయుకులు జనసైనికులు వీరమహిళలు పాత్రికేయులు నా జనసేన కుటుంబం సభ్యులు మిత్రులు గ్రామ ప్రజలు అందరికి పేరు పేరు నా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను నాకు ఈ యొక్క నూతన బాధ్యతను అప్పచెప్పిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి రిటన్ గిఫ్ట్ గా 2024 జనసేన పార్టీ పాలకొండ ఎమ్మెల్యే అభ్యర్థి జయకృష్ణ గెలుపు గెలుపునే పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడానికి పని చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తాను అని మాట ఇస్తాన్నాను. ఈ సందర్బంగా నూతనంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన జనసేన జానీకి పాలకొండ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ గారు సన్మానం కార్యక్రమం చెయ్యడం చాలా సంతోషకరమైన విషయం అని జనసేన జానీ అన్నారు.