గుత్తికొండ జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం

గురజాల: గుత్తికొండ గ్రామ జనసైనికులతో మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్ సోమవారం సమావేశం అయ్యారు. మండలంలో పార్టీ బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం జరిగింది. త్వరలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు చేస్తున్న సహాయాన్ని క్రిందిస్థాయికి తీసుకెళ్లాలని.. రానున్న రోజుల్లో పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలు చేయాలని కామిశెట్టి రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో గురజాల నియోజవర్గ ఐటీ కోఆర్డినేటర్ మునగ వెంకట్, పిడుగురాళ్ల మండల ఉపాధ్యక్షులు పెడకొలిమి కిరణ్ కుమార్, కొత్త శ్రీనివాసరావు, షేక్ యూసుబ్, గ్రామ పార్టీ పెద్దలు, నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.