జనసేన – టిడిపి – బిజెపి లీగల్ సెల్ విభాగం ఆధ్వర్యంలో న్యాయవాదుల ఆత్మీయ సమావేశం

అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జనసేన – టిడిపి – బిజెపి లీగల్ సెల్ విభాగం ఆధ్వర్యంలో శనివారం న్యాయవాదుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన, టిడిపి, బిజెపి కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మరియు ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గారు విచ్చేసినారు, నాయివాదుల సంక్షేమానికి మా సంపూర్ణ తోడ్పాటును అందిస్తాం, మా గెలుపుకు న్యాయవాదుల అందరి సహకారం అందజేయాలని విజ్ఞప్తి చేసినారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు మరియు అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాంరెడ్డి పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని తీర్మానం చేసినారు.