తీగల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ కు ఘనస్వాగతం

తిరుపతి: కాళహస్తి పట్టణంలో ఇటీవల అనే జనసేన నాయకుడు సాయిపై ఆ ప్రాంతంలో సీఐగా పనిచేస్తున్న అంజూ యాదవ్ అకారణంగా చేయి చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేస్తూ తిరుపతి నగరంలోని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసేందుకు తిరుపతి నగరానికి సోమవారం ఉదయం వస్తున్న సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గూడూరు మరియు వెంకటగిరి నియోజకవర్గాల జనసేన పార్టీ కమిటీ సభ్యులు రేణిగుంటలోని తిరుపతి ఎయిర్పోర్ట్ కు వెళ్లి వారి అధినేత పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ జనసేన పార్టీలోని కార్యకర్తలు మరియు నాయకులకు ఎటువంటి ఇబ్బంది కలిగిన వెంటనే స్పందించే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. అనంతరం పట్టణ అధ్యక్షుల పెడ్డిసెట్టి ఇంద్రవర్ధన్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనసేన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు భాస్కర్, సాయి, శివ, కుమార్, సంతోష్, క్రాంతి, అక్బర్, వెంకీ, మనోజ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.