నరసరావుపేట మండలం పాలపాడు వద్ద ఓ యువతి హత్య

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. డిగ్రీ చదువుతున్న ఓ యువతి దారుణ హత్యకు గురయింది.

కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన నరసరావుపేట రూరల్ పోలీసులు.

మృతురాలు ముప్పాళ్ళ మండలం గోళ్ళపాడు గ్రామానికి చెందిన యువతి గా గుర్తించిన పోలీసులు.

హంతకుడు వినుకండ నియోజకవర్గం, బొల్లాపల్లి మండలం గా పోలీసుల తెలిపారు.

మృతురాలు అనూష, హంతకుడు హర్షవర్ధన్ రెడ్డి ఇద్దరు నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రి 2వ సం॥చదువుతున్నారు.

ఈ రోజు కాలేజి కి వెళ్లకుండా పాలపాడు రోడ్డు పొలాల వద్ద కలిసి మాట్లాడుకునే తరుణంలో ఇద్దరి మధ్య వాగ్వాదం, ఆ తరుణంలోనే హర్షవర్ధన్ అనూష ని బలంగా కొట్టి, గొంతు నులిమి చంపినట్లుగా పోలీసులు నిర్ధారణ.

విద్యార్ధితో ప్రేమ వ్యవహారం కారణంగా హత్య జరిగినట్లు నిర్ధారించిన పోలీసులు.

నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన హంతకుడు విష్ణువర్ధన్ రెడ్డి.