బాసర ట్రిపుల్‌ఐటీ ప్రవేశాలకు 16 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ

RGUKT పరిధిలోని బాసర ట్రిపుల్‌ ఐటీలో 2020-21 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ను వర్సిటీ ఏవో రాజేశ్వరరావు శనివారం విడుదలచేశారు. టీఎస్‌ ఆన్‌లైన్‌, మీ సేవ కేంద్రాల ద్వారా admisSions@rgukt.ac.in వెబ్‌సైట్‌ ద్వారా ఈ నెల 16 నుంచి వచ్చేనెల మూడు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. టెన్త్‌ పాసైన విద్యార్థులు ఇందుకు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైనవారి జాబితాను అక్టోబర్‌ 20న విడుదల చేస్తామన్నారు. కొవిడ్‌ దృష్ట్యా పదోతరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండానే ప్రభుత్వం అందరినీ పాస్‌ చేసింది. ఏపీ కోటా సీట్లు తర్వాత భర్తీ చేయనుంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టానికి కేటాయించిన 15 శాతం సీట్లను తర్వాత భర్తీ చేయనున్నారు. ఆ రాష్ట్రంలో పదోతరగతి విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించకపోవడంతో ఆ సీట్లను తర్వాత భర్తీ చేయనున్నారు. దీంతో ఓపెన్‌ క్యాటగిరీలో 15 శాతం సీట్లను ఏపీలో గ్రేడ్లు నిర్ణయించాకే భర్తీ చేస్తామని, ఈ విషయాన్ని వెబ్‌సైట్‌లో పొందపర్చనున్నట్లు ఏవో రాజేశ్వరరావు తెలిపారు. వీటిపై సందేహాలు నివృత్తికి కోసం హెల్ప్‌లైన్‌ నంబర్లకు 9573001992, 9703760686 ఫోన్‌చేయాలని సూచించారు.