ఏ.ఆర్.ఎం రైస్ మిల్లు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి: తగరపు శ్రీనివాస్

హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక ఆరపల్లెలోని అనందాసు రాంమోహన్ ఏ.ఆర్.ఎం రైస్ మిల్లుపై చర్యలు తీసుకోవాలని హుస్నాబాద్ నియోజకవర్గ జనసేన పార్టీ తరపున ఎం.ఆర్.ఓ అధికారులకు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ కో ఆర్డినేటర్ తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ రైస్ మిల్లు నుండి వెలువడుతున్న కాలిన బూడిద వల్ల వాహనదారులు, చుట్టు ప్రక్కల ఉన్న రైతుల పొలాలపై బూడిద పడి, పంటలకు నష్టం వాటిల్లుతోంది. ఆరపల్లెవాసులు రైస్ మిల్లు యాజమాన్యంతో పలుమార్లు మాట్లాడినా పట్టించుకోవడం లేదు, కావున మీరు తక్షణమే మిల్లు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరపున కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మల్లెల సంతోష్, లక్కిరెడ్డి హిమవంత్, రాసూరి వంశీకృష్ణ, రఘు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.