క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన వడ్డాది శ్రీనువాస్

ఎచ్చెర్ల నియోజకవర్గం: రణస్థలం మండలం పైడిభీమవరం పంచాయతీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం ఉదయం వడ్డాది శ్రీనువాసరావు అధ్వర్యంలో నియోజకవర్గం స్ధాయిలో జనసేన పార్టీ తరుపున క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు భూపతి అర్జున్, మండలం నాయకులు పోట్నూరు లక్ష్మునాయుడు, బిసి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి బలరాం, దన్నాన చిరంజీవి, దనాన రవీంద్ర, ముల్లు శ్రీను, లావేరు మండల నాయకులు బొంతు విజయ్ కృష్ణ, ఎచ్చెర్ల మండల నాయకులు తమ్మినేని శ్రీనివాసరావు, ఎచ్చెర్ల నియోజకవర్గం ఐటీసీ సభ్యులు గోర్లె రాంబాబు, రామకృష్ణ తదితర జనసైనికులు మరియు క్రికెట్ క్రీడాభిమానులు పాల్గొన్నారు.