జీవీఎంసీలో జోరుగా కొనసాగుతున్న క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం

  • రెండో రోజు అదే ఉత్సాహం

గాజువాక: జనసైనికులకు అండగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్యకర్తలకు భరోసా ఇచ్చే విధంగా జనసేన పార్టీ అధ్యక్షులు కోణిదెల పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన మూడవ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆదివారం జీవీఎంసీ 85వ వార్డులో చేరిన కొండయ్య వలస, మినీ జగదాంబ సెంటర్లో గాజువాక నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు మరియు జీవీఎంసీ 85వ వార్డు ఇంచార్జ్ గవర సోమశేఖర రావు ఆధ్వర్యంలో రెండో రోజు కూడా ఉత్సాహంగా జరిగింది. ఈ రోజు ఆదివారం కావడంతో ఎక్కువమంది తమ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎక్కువ సాతంలో సభ్యత్వాన్ని రెన్యువల్ చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పి వసంత్ కుమార్, కళ్ళుబంటి సుధాకర్, లక్కరాజు సన్యాసిరావు, సీరం శెట్టి వెంకట్రావు, మోటూరు అప్పారావు, విందుల పాపారావు, జాజుల రామకృష్ణ, లక్కరాజు అప్పలరాజు, లక్కరాజు రమణ, జాజుల శ్రీను, దుల్ల ఈశ్వరరావు, జాజుల్ వంశీ, జాజుల కృష్ణ, విందుల జానీ అలియాస్ అప్పలరాజు, దేవ, సాయి, చంటి, శ్రీకృష్ణ, అజయ్, బాబి, రాజు, ఆనంద్, ఇతర జనసైనికులు మరియు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.