రేపల్లెవాడలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం

పోలవరం నియోజకవర్గం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసైనికుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీలో భాగంగా పోలవరం మండలం, రేపల్లెవాడ గ్రామంలో గురువారం మండల అధ్యక్షులు గుణపర్తి వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీకార్యక్రమానికి పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించిన ఈ గొప్ప కార్యక్రమం వాళ్ళ ఎన్నో కుటుంబాలకు భరోసా ఉంటుందని, ఇప్పుడు 5,000 సభ్యత్వాలు అయ్యాయి కాబట్టి వచ్చే విడతలో పోలవరం నియోజకవర్గం నుంచి 15,000 సభ్యత్వాలు చేసేలా చూడాలని, పార్టీకి సంబందించిన గాజు గ్లాస్ గుర్తు అందరిలోకి తీసుకువెళ్లాలని, ఉన్న కొద్దీ సమయంలో జనసేన పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడాలని, ఈ అవినీతి, అసమర్థ ప్రభుత్వాన్ని గద్దే దించే వరకూ కష్టపడాలన్నారు. ఈ కార్యక్రమంలోపాదం కృష్ణ, మామిడిపల్లి వరప్రసాద్, కరిబండి గనిరాజు, జానపాటి బాబి మరియు మండల గ్రామ కమిటి సభ్యులు పాల్గొన్నారు.