85 వ వార్డులో జోరుగా క్రియాశీలక సభ్యత్వ నమోదు

విశాఖ దక్షిణం, జనసైనికుల కుటుంబాల యోగక్షేమాలు కాంక్షించి జనసేనాని పవన్ కళ్యాణ్ చేపట్టిన ఐదు లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ తో కూడిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జీవీఎంసీ 85వ వార్డులో చేరిన కొండయ్య వలస మినీ జగదాంబ సెంటర్ వద్ద గవర సోమశేఖర్ రావు ఆధ్వర్యంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువత క్రియాశీలక సభ్యత్వ నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 28 వ తేదీ సభ్యత్వ నమోదుకు ఆఖరి రోజు కావడంచే ఆదివారం తేదీ 26/02/23 న వార్డులో మినీ జగదాంబ సెంటర్ తో పాటు కొత్తూరు – డొంకాడ కూడలిలో కూడా క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ క్యాంపులను జనసైనికులు, జనసేన పార్టీ కోసం పని చేయాలనే సంకల్పం కలిగిన ప్రజలు సభ్యత్వ నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బలిరెడ్డి అరవింద్, పి వసంత్ కుమార్, మాదాసు రామకృష్ణ, లక్కరాజు సన్యాసిరావు, సీరంశెట్టి వెంకట్రావు, మాటూరు అప్పారావు, విందుల నర్సింగరావు, విందుల పాపారావు, జాజుల శ్రీను, శిరసపల్లి దిలీప్, బి ప్రసాదరావు, మోటూరు శ్యామ్, విందుల జానీ అలియాస్ అప్పలరాజు, లకరాజు రమణ, దేవ, సాయి, చంటి, శ్రీకృష్ణ, అజయ్, బాబి, రాజు, ఆనంద్, ఇతర జనసైనికులు మరియు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.